HomeTelugu Trendingరంగంలోకి దిగిన 'ఆచార్య'!

రంగంలోకి దిగిన ‘ఆచార్య’!

chiranjeevi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుకున్న తాజా చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి చాలాకాలం అయింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గడం వలన ఈ రోజున షూటింగును మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో చిరంజీవి, చరణ్ ఇద్దరూ కూడా పాల్గొంటున్నట్టు చెబుతున్నారు. కొన్ని కీలమైన సన్నివేశాలను ప్లాన్ చేశారట.

ఈ షెడ్యూలుతో ఈ సినిమా షూటింగ్‌ పార్టు పూర్తవుతుందని అంటున్నారు. ఈ నెల చివరికి ఈ షెడ్యూల్ పూర్తవుతుంది. ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబర్లో ప్రమోషన్లు మొదలుపెట్టి, దసరాకి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ నటిస్తుండగా.. రామ్‌చరణ్‌కు జంటగా పూజ హెగ్డే నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దసరాకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu