HomeTelugu Big Stories'భవదీయుడు భగత్ సింగ్' నుంచి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్

‘భవదీయుడు భగత్ సింగ్’ నుంచి డైలాగ్ లీక్ చేసిన మెగాస్టార్

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’ రెండు రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు . మరోవైపు ఇంటర్వ్యూలతో సినిమా రీచ్ ను పెంచేస్తున్నార. తాజాగా దర్శకుడు హరీశ్ శంకర్ ‘ఆచార్య’ స్టార్ కాస్ట్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నిలు సంధించార. అయితే తొందరపాటులో తన రాబోయే చిత్రం ‘భవదీయుడు భగత్ సింగ్’లోని పవర్ ఫుల్ డైలాగ్ ను లీక్ చేశాడు.

హరీశ్ శంకర్ డైలాగ్ ను లీక్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారింది ‘మొన్న వీడు మన ఇంటికొచ్చి, పెద్దగా అరిచినప్పుడు, అసలు ఎంట్రా వీడి ధైర్యం అని అనుకున్నా.. ఇప్పుడు అర్థమైంది. వీడు నడిస్తే వెనకాల లక్షమంది నడుస్తున్నారు. బహూశా ఇదే ఇతని ధైర్యమేమో. లేదు సార్.. ఆ లక్షలాది మందికే ఆయన ముందుండి నడుస్తున్నాడన్నదే ధైర్యం..’ అనే మాస్ డైలాగ్ ను పవన్ కోసం హరీశ్ శంకర్ రాశాడట.. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే పూర్తి కావచ్చాయి. త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే మాస్ డైలాగ్స్ ను వదులుతూ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’పై అంచనాలను పెంచేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu