HomeTelugu Big StoriesMythri Movie Makers వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటంటే..

Mythri Movie Makers వేసిన మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఏంటంటే..

Guess the mind blowing plan of Mythri Movie Makers!
Guess the mind blowing plan of Mythri Movie Makers!

Mythri Movie Makers Movies:

తెలుగు సినిమాల్లో టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగిన మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు భారీ మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు నిర్మించేందుకు రంగంలోకి దిగారు. అయితే ఇటీవల నిర్మాతలకు ఎదురవుతున్న సమస్యలు మాత్రం చిన్నవి కావు. షూటింగ్ డిలేలు, నిర్మాణ భారం, OTT ప్లాట్‌ఫాంల నుంచి వచ్చే కఠినమైన నిబంధనలు, ఆర్థిక సమస్యలు అన్నీ కలిసిపోవడంతో నిర్మాతలు కష్టాలు పడుతున్నారు.

ఇటీవల మైత్రీ బ్యానర్‌లో విడుదలైన రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ اگ్లీ, జాత్ సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. వీటి వల్ల బ్యానర్‌కు కొన్ని నష్టాలు కూడా వచ్చాయి. అయినా కూడా మైత్రీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు.

దీంతో పాటు యంగ్ హీరోలతో కూడా పలు ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి. ఇక నుంచి కొత్త విధానం అమలు చేయాలని మైత్రీ నిర్ణయం తీసుకుంది. భారీ రెమ్యునరేషన్‌లను కట్టడం కంటే ప్రాఫిట్ షేరింగ్ మోడల్‌ను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అంటే సినిమా విజయవంతమైతే అందులోని లాభాలను హీరోలు, డైరెక్టర్లు షేర్ చేసుకుంటారు. లేదంటే తక్కువ పారితోషికంతో తక్కువ బడ్జెట్‌లో, తక్కువ సమయంలో సినిమా పూర్తిచేయాలి.

ఈ విధానం వల్ల నిర్మాతల భారం కొంత తగ్గుతుంది. ఇక నుంచి మిడిల్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా ఈ ఫార్మాట్‌లోనే రూపొందే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో నిర్మాతలు, హీరోల మధ్య కొత్త ఎక్వేషన్స్ ఏర్పడనున్నాయి. టోటల్‌గా చూస్తే.. మైత్రీ తీసుకున్న ఈ స్టెప్ ఇండస్ట్రీకి ఒక మంచి మార్గం కావచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!