Homeపొలిటికల్CM Revanth జపాన్ టూర్ తో తెలంగాణకి ఇన్ని కోట్లు వచ్చాయా?

CM Revanth జపాన్ టూర్ తో తెలంగాణకి ఇన్ని కోట్లు వచ్చాయా?

CM Revanth’s Japan Tour Brings a Jackpot for Telangana!
CM Revanth’s Japan Tour Brings a Jackpot for Telangana!

CM Revanth’s Japan Tour:

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్‌తో ఓ బంపర్ డీల్ కొట్టేశారు. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.12,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి లాంచయ్యాయి అంటే గర్వించాల్సిన విషయం కదా! టోక్యోలోని ప్రముఖ డేటా సెంటర్ కంపెనీలు NTT Data మరియు Nesa కలిసి హైదరాబాద్‌లో భారీ AI డేటా సెంటర్ క్లస్టర్ నిర్మించడానికి రూ.10,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఒప్పందం కుదిరింది. ఇదంతా రేవంత్ రెడ్డి సమక్షంలోనే జరిగింది.

ఇంకా, ఇప్పటికే హైదరాబాద్ రుద్రారామంలో రెండు ఫ్యాక్టరీలు నడుపుతున్న టోషిబా కార్పొరేషన్, ఇప్పుడు కొత్తగా రూ.562 కోట్లతో మరో ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఇందులో సర్జ్ అరెస్టర్లు తయారీతో పాటు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ప్రొడక్షన్‌ను కూడా అప్‌గ్రేడ్ చేయబోతున్నారు.

రేవంత్ రెడ్డి జపాన్ బిజినెస్ లీడర్స్‌తో సమావేశమై, తెలంగాణలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్డ్ వర్క్‌ఫోర్స్, స్టేబుల్ పాలసీల గురించి వివరించారు. లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, టెక్స్టైల్స్, AI డేటా సెంటర్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు.

ఇదే సమయంలో ముసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం జపాన్‌లోని సుమిడా నది ప్రాజెక్ట్‌ను కూడా స్టడీ చేశారు. 1964కి ముందు చాలా కాలుష్యంగా ఉన్న సుమిడా నది, అక్కడి ప్రభుత్వం చేసిన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు టూరిజం, కమర్షియల్ హబ్‌గా మారింది. ఇదే తరహాలో ముసీ ప్రాజెక్ట్‌ను రూపొందించాలనే రూట్‌మ్యాప్‌తో సీఎం వెళ్లినట్టు తెలుస్తోంది.

టోక్యో టూర్ ముగిసిన తర్వాత సీఎం టీమ్ ఓసాకా వెళ్లింది. అక్కడ మౌంట్ ఫుజి, అరాకు రుయామా పార్క్‌లను సందర్శించడంతో పాటు, కితా క్యుషు సిటీ మేయర్‌ను కలసి ‘ఇకో టౌన్ ప్రాజెక్ట్’ గురించి తెలుసుకోనున్నారు. అలాగే యుమిషిమా, ఓసాకాలో జరిగే వరల్డ్ ఎక్స్‌పోలో కూడా పాల్గొనబోతున్నారు.

మొత్తంగా చెప్పాలంటే, జపాన్ టూర్‌తో రేవంత్ రెడ్డి తన విజన్‌తో పాటు తెలంగాణ బ్రాండ్‌ను గ్లోబల్‌గా ప్రమోట్ చేసినట్టే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu