HomeTelugu Trendingసీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన అక్కిని నాగార్జున దంపతులు

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన అక్కిని నాగార్జున దంపతులు

akkineni nagarjuna couple m

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, అమల మర్యాదపూర్వకంగా కలిశారు. శ‌నివారం ఉద‌యం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయన‌ను కలవడం ఇదే మొదటిసారి. మ‌రోవైపు రేవంత్ సీఎం అయిన అనంత‌రం ప‌లువురు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు రేవంత్‌ను క‌లిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్ర‌స్తుతం నాగార్జున నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమామ సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. విజయ్‌ బన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాత. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి గ్లింప్స్‌తో పాటు టీజ‌ర్‌ను చిత్రబృందం విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu