HomeTelugu Newsఏపీలో కరోనా కేసులు @ 1717

ఏపీలో కరోనా కేసులు @ 1717

15

ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ తాజాగా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1717కి చేరింది. కర్నూలులో 516, గుంటూరు 351, కృష్ణా 286, నెల్లూరు 92, కడప 89, చిత్తూరు 82, అనంతపురం 80, ప.గో 59, తూ.గో 45, విశాఖ 37, శ్రీకాకుళం 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి ఏపీలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. 589 మంది కరోనానుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 1094 మంది చికిత్స పొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu