HomeTelugu Newsతెలంగాణ అధికారుల్లో మళ్లీ కరోనా టెన్షన్..!

తెలంగాణ అధికారుల్లో మళ్లీ కరోనా టెన్షన్..!

12 8
తెలంగాణలో వరుసగా మూడో రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు తగ్గుముఖం పట్టాయనుకున్న సమయంలో గత 2 రోజులనుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ తాజాగా 79 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసులు హైదరాబాద్‌ పరిధిలోనే బయటపడ్డాయి.
దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇప్పటి వరకు 30 మంది కరోనాతో మృతిచెందగా 801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరో 444 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇవాళ మరో 50 మంది డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. గత 14 రోజుల్లో తెలంగాణలోని 24 జిల్లాల్లో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu