HomeTelugu Big Storiesఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా బాధితులు

ఏపీలో పెరుగుతూనే ఉన్న కరోనా బాధితులు

5 7
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 54 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 7,320 మందికి పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1887కి చేరింది. కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 41కి చేరింది. ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 14 మంది, కృష్ణా జిల్లాలో 11 మంది, గుంటూరు 8, అనంతపురం 4, నెల్లూరు 3, విశాఖలో ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇప్పటి వరకు ఏపీలో కరోనా నుంచి కోలుకుని 842 మంది డిశ్చార్జి కాగా 1004 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు.

జిల్లాల వారీగా కరోనా బాధితులు: కర్నూలు 547, గుంటూరు 374, కృష్ణా 322, అనంతపురం 99, కడప 96, నెల్లూరు 96, చిత్తూరు 85, ప.గో 68, ప్రకాశం 61, విశాఖ 57, తూ.గో 46, శ్రీకాకుళం 5, విజయనగరం 4, ఇతరులు 27 మంది కరోనా బాధితులు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu