Homeతెలుగు Newsజగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం: దేవినేని

జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం: దేవినేని

7 8వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఇక కాశీయాత్ర చేసుకోవడం ఉత్తమం అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. అక్కడకు వెళితే మీరు స్నేహం చేసే మోడీ కూడా తోడవుతారని ఎద్దేవాచేశారు. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా జగన్‌ చేసిన ప్రసంగంపై దేవినేని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ మాటల్లో ఒక్కటి కూడా వాస్తవం లేదని ఆరోపించారు. గ్రామాల్లో పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంటే అబద్ధాలు ప్రచారం చేస్తారా? అని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ఒక్క మాటైనా మాట్లాడారా? అని నిలదీశారు. నిన్నటి జగన్‌ ప్రసంగంలో నిరాశ, నిస్పృహ స్పష్టంగా కనిపించిందన్నారు. జగన్‌, కేసీఆర్‌, మోడీ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంకల్పయాత్ర ముగింపు కాదని.. అది వైసీపీ ముగింపు యాత్ర అని అన్నారు దేవినేని.

Recent Articles English

Gallery

Recent Articles Telugu