HomeTelugu Newsటాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌కు కరోనా

టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌కు కరోనా

Krish

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుందన్న సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కరోనా రెండో దశ విజృంభిస్తోందని నిపుణులు చెప్తున్నారు. కరోనా పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు దీని బారిన పడ్డారు. ఇటీవలే హీరో రాంచరణ్‌, వరుణ్‌తేజ్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌ తర్వాత వరుణ్‌ తేజ్‌కూ కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు తాజాగా స్టార్ డైరెక్టర్ క్రిష్ కి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రామ్‌ చరణ్‌, వరుణ్‌ తేజ్‌ల పార్టీలో క్రిష్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే క్రిష్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. జనవరి 4 నుంచి షూటింగ్ చేయాలనుకున్న క్రిష్‌కు కరోనా సోకడంతో అది వాయిదా పడింది. షూటింగ్ లో పాల్గొనే సిబ్బంది అంతా టెస్టులు చేయించుకోగా వారికి నెగెటివ్ వచ్చినట్టు తెలిసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu