HomeTelugu Newsఏపీ వాసుల కోసం లారెన్స్ ఏంచేశాడంటే..!

ఏపీ వాసుల కోసం లారెన్స్ ఏంచేశాడంటే..!

12 9
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా తమిళనాడులో చిక్కుకుపోయిన 37 మంది ఏపీకి చెందిన వారిని సినీనటుడు, దర్శకుడు లారెన్స్ ఆదుకున్నారు. లాక్‌డౌన్‌తో తినడానికి ఆహారం లేక తమిళనాడులో చిక్కుకున్న వీరిని స్వస్థలాలకు పంపేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కొద్దిరోజుల క్రితం తమిళనాడు సీఎం పళని స్వామికి లారెన్స్ ఓ వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన సీఎం వెంటనే ఏపీకి చెందిన వారి వివరాలు సేకరించి వారం రోజుల్లోనే వారిని స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. తన విజ్ఞప్తి మేరకు వెంటనే స్పందించిన సీఎం పళని స్వామితో పాటు, అధికారులను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లారెన్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu