HomeTelugu Newsనందమూరి హరికృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి

నందమూరి హరికృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి

6 16దివంగత టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కుమారులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ తదితరులు నివాళులర్పించారు. గత ఏడాది ఆగస్టు 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. హరికృష్ణ హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, కుటుంబ సభ్యుల్ని శోకసంద్రంలో ముంచింది. తిథుల ప్రకారం ఈరోజు ఆయన వర్థంతిని నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!