HomeTelugu Trendingమరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు

మరో వివాదంలో శిల్పాశెట్టి దంపతులు

FIR against on shilpa shett

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు తాజాగా మరో పెద్ద సమస్య ఇరుకున్నారు. 1.51 కోట్ల చీటింగ్ కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పూణె యువకుడు యష్ బరాయ్ ఈ జంట తనను మోసం చేశారంటూ కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్‌పై కూడా ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ ఘటన జూలై 2014లో జరిగినట్లు తెలుస్తోంది.

FIR against 2

అసలు విషయంలోకి వెళ్తే… ఫిట్‌నెస్ స్కీమ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టమని కాషీఫ్ ఖాన్, శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాతో పాటు పలువురు తనను అడిగారని, భారీ లాభాలు వస్తాయని ఆశ చూపారని సదరు యువలకుడు ఈ ఫిర్యాదులో ఆరోపించారు. కానీ అందులో తనకు ఎలాంటి లాభాలు రాకపోవడంతో తన డబ్బు 1.51 కోట్లు ఇచ్చేయాలంటూ అడగ్గా, యష్ ని బెదిరించారట. దీంతో చేసేది లేక యష్ బరాయ్ పోలీసులను ఆశ్రయించాడు.

FIR against 1

అశ్లీలత కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుండి శిల్పా కుటుంబం చట్టపరమైన సమస్యల్లో చిక్కుకుంటూనే ఉంది. రాజ్ కుంద్రా రెండు నెలల పాటు ఆర్థర్ రోడ్ జైలులో గడిపి, ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. అలా బయటకు వచ్చిన తరువాత మొదటిసారిగా శిల్పా, రాజ్ కుంద్రా కలిసి వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ ట్రిప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత ఈ జంట బయట కలిసి కనిపించడం ఇదే తొలిసారి. కానీ ముంబైకి పిల్లలతో కలిసి శిల్పా మాత్రమే తిరిగి వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu