జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వారం రోజులపాటు జరుపుకోవాలని సూచించారు. దేశ త్యాగధనుల చరిత్రను భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచైనా ఈ వేడుకలు జరపాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు దేశ భ్యవిష్యత్ కోసం త్యాగాలు చేసే వారు కరవయ్యారని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు దేశసమైక్యత కోసం ప్రతి జనసేన కార్యకర్త త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.