HomeTelugu Newsతెలంగాణలో 20మంది చిన్నారులకు కరోనా..!

తెలంగాణలో 20మంది చిన్నారులకు కరోనా..!

7 14
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటికే 644కు చేరింది.. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఇందులో కనీసం నెలకూడా నిండని పసికందు కూడా ఉన్నారు.. మొత్తం 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఇప్పటి వరకు 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని గాంధీఆస్పత్రిలో పెట్టి.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. రాష్ట్రంలో 20మంది చిన్నారులకు కరోనా సోకగా.. బాధితుల్లో 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.ఈ చిన్నారులకు 20 మంది ప్రత్యేక డాక్టర్లు.. వైద్యం అందిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలోని 6వ ఫ్లోర్‌లో చిన్నారులకు ప్రత్యేకవార్డును ఏర్పాటు చేశారు. అయితే, ఓ బాలుడి కేసు మాత్రం డాక్టర్లుకు సవాల్‌గా మారింది.. ఇతర సమస్యలున్న మూడేళ్ల బాలుడికి కరోనా రాగా.. ఆ బాలుడికి ట్రీట్‌మెంట్ అందివ్వడం సవాల్‌గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!