HomeTelugu Newsఒక్కడు విలన్‌గా గోపీచంద్‌ని అనుకున్నారట!

ఒక్కడు విలన్‌గా గోపీచంద్‌ని అనుకున్నారట!

9 14
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు స్టార్‌డమ్‌ను తెచ్చి పెట్టిన చిత్రం సినిమా ‘ఒక్కడు’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎమ్మెస్ రాజు నిర్మించాడు. ఈ సినిమాలో విలన్‌గా ‘ఓబుల్ రెడ్డి’ పాత్రలో ప్రకాశ్ రాజ్ ఓ రెంజ్‌లో నటించాడు. ఆ పాత్ర కోసం ముందుగా గోపీచంద్ ను అనుకున్నారట.

అయితే అప్పటికే గోపీచంద్ .. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘నిజం’ సినిమాలో విలన్ పాత్రకి ఎంపిక అయ్యాడు. దాంతో రెండు సినిమాల్లోనూ విలన్ గోపీచంద్ అయితే బాగుండదేమోననే అభిప్రాయాన్ని మహేష్‌ బాబు వ్యక్తం చేయడంతో, ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నారు. ‘ఒక్కడు’ సినిమాలో గోపీచంద్ కి అవకాశం ఇవ్వలేకపోయామనే ఫీలింగ్ ఎమ్మెస్ రాజుకి ఉండేదట. అందువల్లనే ఆ తరువాత నిర్మించిన ‘వర్షం’ సినిమాలో విలన్‌గా గోపీచంద్‌ని తీసుకున్నారట. ఆ పాత్ర గోపీచంద్ కి ఎంత పేరు వచ్చిందో తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!