Jio Hotstar Merger:
రిలయన్స్ జియో, డిస్నీ సంస్థలు తమ సంయుక్త వ్యాపార ఒప్పందాన్ని పూర్తి చేసుకున్నాయి. ముంబై ఎన్సిఎల్టి, సిసిఐ, మరియు స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIPL) నుండి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత, ఈ ఒప్పందం పూర్తయింది. ఈ వ్యాపార విలువ సుమారు రూ. 70,352 కోట్లు (USD 8.5 బిలియన్) అని తెలుస్తోంది.
ఈ విలీనంతో భారతదేశంలో అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటి అవతరించనుంది. ఈ సంయుక్త వ్యాపారం (JV) అభివృద్ధికి రిలయన్స్ సంస్థ రూ. 11,500 కోట్ల పెట్టుబడిని అందించింది. ఈ ఒప్పందంలో రిలయన్స్ 16.34%, వయాకామ్18 46.82%, డిస్నీ 36.84% వాటాలను కలిగి ఉంటాయి.
Reliance is merging its OTT platform, Jio Cinema, with Hotstar, since both platforms are already owned by Reliance.
Right after the news broke, someone from Delhi grabbed the domain JioHotstar/com.
Now, he’s asking Reliance to pay for his studies abroad in exchange for… pic.twitter.com/BNDScHlI3p
— Aaraynsh (@aaraynsh) October 24, 2024
అయితే, రిలయన్స్ ఈ వ్యాపారంలో నియంత్రణ స్థానంలో ఉండనుంది. నీతా అంబానీ ఈ సంయుక్త వ్యాపారానికి చైర్ పర్సన్ గా, ఉదయ్ శంకర్ వైస్ చైర్ పర్సన్ గా వ్యవహరించనున్నారు. వ్యాపార నిర్వహణలో ఎంటర్టైన్మెంట్ విభాగానికి మూడవురు సిఇఓలు ఉండనున్నారు: కెవిన్ వాజ్, డిజిటల్ ఆర్గనైజేషన్కు కిరణ్ మాణి, స్పోర్ట్స్ విభాగానికి సంజోగ్ గుప్తా.
ఈ జేవీ 100కిపైగా టీవీ ఛానెళ్లను నిర్వహించడంతో పాటు రెండు ప్రముఖ ఓటిటి ప్లాట్ఫారమ్లు, డిస్నీ+ హాట్స్టార్, జియోసినెమాను కూడా కలిగి ఉంది. దీని ద్వారా భారతీయ మీడియా రంగంలో గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ రెండు ఓటిటి ప్లాట్ఫారమ్లు ఇప్పటికే భారతదేశంలో భారీ స్థాయి ప్రేక్షకులను ఆకర్షించాయి. వాటి కలయికతో ఈ జాయింట్ వెంచర్ మరింత విస్తృతంగా ప్రజాదరణ సాధించే అవకాశం ఉంది.
డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో.. రిలయన్స్, డిస్నీ కలయిక భారతీయ ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించనుంది.
ALSO READ: VD12 సినిమాకి బాలయ్యకి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా?