HomeTelugu Newsహరీశ్‌ శంకర్‌ని లైన్‌లో పెట్టిన మహేశ్‌!

హరీశ్‌ శంకర్‌ని లైన్‌లో పెట్టిన మహేశ్‌!

8 16
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు తన నటించబోయే సినిమా కథ, పాత్రలపై ప్రత్యేక శ్రద్ధ పెడతాడు. ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతుంటాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తరువాత వెంటనే ఆయన వంశీ పైడిపల్లితో చేయాలనుకున్నాడు. కానీ కథ పూర్తిస్థాయిలో సంతృప్తిని ఇవ్వకపోవడంతో, పరశురామ్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి కొంత లేట్‌ అయింది.

ఆ తరువాత ప్రాజెక్టు విషయంలో ఇలా జరగకుండా ఉండటం కోసం, హరీశ్ శంకర్ ను లైన్లో పెట్టాడనేది తాజా సమాచారం. హరీశ్ శంకర్ వినిపించిన ఒక లైన్ కి మహేశ్ బాబు ఓకే చెప్పేశాడని అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. త్వరలో మహేశ్ బాబుతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని చెప్పాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు సెట్ అయిందన్న మాట. ప్రస్తుతం పవన్ సినిమా కోసం హరీశ్ శంకర్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ తరువాత మహేశ్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu