HomeTelugu Trendingఇదే నా నెం:1 సెల్ఫీ: దేవిశ్రీ ప్రసాద్‌

ఇదే నా నెం:1 సెల్ఫీ: దేవిశ్రీ ప్రసాద్‌

10 4
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసిన మెగాస్టార్‌ చిరంజీవికి.. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మెగాస్టార్‌, సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన సెల్ఫీని ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. ఇదే నెం:1 సెల్ఫీ అని దేవిశ్రీ పేర్కొన్నారు. అంతేకాకుండా ఆదివారం నిర్వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ వేడుకను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘సెల్ఫీ నెం:1 ఇది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి సర్‌కు ధన్యవాదాలు. ప్రియమైన మహేష్‌‌.. మీరు నామీద ఉంచిన నమ్మకానికి, ప్రేమాభిమానాలకు థాంక్యూ. అలాగే మా వేడుకను మరింత జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని దేవిశ్రీ పేర్కొన్నారు.

ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ స్వరాలు అందించారు. దిల్‌రాజు, మహేష్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!