HomeTelugu Trendingరెండోసారి కరోనా బారినపడిన శరత్‌ కుమార్‌

రెండోసారి కరోనా బారినపడిన శరత్‌ కుమార్‌

Hero sarath kumar corona po
కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కుటుంబం మొత్తం కరోనా బారిన పడ్డారు. రాధికా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్ కు పాజిటివ్ రావడంతో వారు ఐసోలేషన్ లో ఉండి ఇటీవలే బయటికి వచ్చారు. ఇక శరత్ కుమార్ సైతం కోలుకొని బయటికి వచ్చిన కొద్దిరోజులకే మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘ప్రియమైన స్నేహితులు, నా దగ్గరి బంధువులు రాజకీయ పార్టీలోని నా సోదర సోదరీమణులకు తెలియజేస్తున్నాను. ఈ సాయంత్రం నేను పరీక్ష చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నేను ఐసోలేషన్ లో ఉన్నాను. నాతో గత వారం రోజులుగా పరిచయం ఉన్న ప్రియమైన వారందరూ వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసిందిగా సవినయంగా కోరుతున్నాను’ అంటూ తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్నఆయన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు.

హాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Recent Articles English

Gallery

Recent Articles Telugu