టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన బ్యూటీ పూర్ణ (షమ్న ఖాసిమ్). ఇటీవలే టీవీ షోలకు జడ్డిగా వ్యవహరించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ కేరళ కుట్టి తాజాగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు ఆమె స్వయంగా ప్రకటించింది. ఈ శుభ సందర్భాన్ని తన భర్త, కుటుంబసభ్యులతో కలిసి ఆమె సెలబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 24న దుబాయ్ లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. మరోవైపు తల్లి కాబోతున్న పూర్ణకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.













