
Mega 157 Movie Heroines:
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘మెగా 157’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ల ఎంపికపై క్లారిటీ వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, నయనతార ప్రధాన హీరోయిన్గా ఎంపికయ్యారు. మరోవైపు కేథరిన్ ట్రెసా కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
నయనతార పాత్ర కథలో కీలకమైతే, కేథరిన్ ట్రెసా పాత్ర క్లైమాక్స్లో హైలైట్ కానుందని టాక్. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సహు గరపాటి నిర్మిస్తున్నారు. మే 22 నుంచి చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నారట.
అంతేకాకుండా విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తారనే గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి మాస్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారని టాక్. పాటలు, ఫైట్లు, ఎమోషన్స్ అన్నీ కలిపి మాస్కి పండగలా ఉండబోతున్న ‘మెగా 157’పై ఫ్యాన్స్కి భారీ అంచనాలే ఉన్నాయి.