HomeTelugu Big Stories'భారతీయుడు 2' నుంచి అందుకే తప్పుకున్న: ఐశ్వర్య రాజేష్‌

‘భారతీయుడు 2’ నుంచి అందుకే తప్పుకున్న: ఐశ్వర్య రాజేష్‌

13 9విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’ నుంచి తమిళ నటి ఐశ్వర్య రాజేష్‌ తప్పుకున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ హీరోయిన్‌. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఐశ్వర్య రాజేష్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సూపర్‌హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా వస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

కాగా ఈ సినిమా గురించి తాజా ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడారు. డేట్స్‌ కుదరకపోవడంతో కమల్‌ చిత్రం నుంచి వైదొలిగినట్లు వెల్లడించారు. ‘నేను డేట్స్‌ సర్దుబాటు చేసుకోలేకపోయాను. పరస్పర అంగీకారంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాం. నిజంగా చాలా బాధగా ఉంది. కమల్‌ సర్‌, శంకర్‌ సర్‌తో కలిసి పనిచేసే అవకాశాన్ని మిస్‌ అయ్యాను. నాకు ఇది డ్రీమ్‌ ప్రాజెక్టు. మరోసారి వారి సినిమాలో నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ‘కౌసల్య కృష్ణమూర్తి’ తో విజయం అందుకున్న ఈ భామ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 14 సినిమాలు ఉన్నాయి. ఇటీవల ‘భారతీయుడు 2’ నుంచి సినిమాటోగ్రాఫర్‌ రవి వర్మన్‌ తప్పుకున్నారు. మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ కోసం ఆయన ఈ సినిమా వద్దనుకున్నారు. దీంతో శంకర్‌ ఆ స్థానంలో రత్నవేలును తీసుకున్నారు. శంకర్‌, రత్నవేలు కలిసి ‘రోబో’ సినిమా కోసం పనిచేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!