HomeTelugu Newsదుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

దుకాణాల వద్ద బారులు తీరిన మందుబాబులు

3 3
కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో మద్యం ప్రియులు ఇన్నాళ్లు విలవిల్లాడిపోయారు. తాజాగా గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. కంటైన్‌మెంట్‌ జోన్లు తప్ప మిగతా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మద్యం ప్రియులుతో దుకాణాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిచ్చాయి.

గుంటూరు జిల్లా బెల్లంకొండ ప్రాంతంలో ఉదయం దుకాణాలు తెరవక ముందే మందుబాబులు పడిగాపులు కాస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు, విశాఖ, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, విజయవాడ తదితర జిల్లాల్లో మద్యం ప్రియులు దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పలు చోట్ల భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.

3a

Recent Articles English

Gallery

Recent Articles Telugu