HomeTelugu Newsజగన్‌లో ఎంతో మార్పు వచ్చింది: జెడీ చక్రవర్తి

జగన్‌లో ఎంతో మార్పు వచ్చింది: జెడీ చక్రవర్తి

3 6ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిలో ఎంతో మార్పు వచ్చిందని అంటున్నారు సినీ నటుడు జేడీ చక్రవర్తి. ఆయన కీలక పాత్రలో నటించిన ‘హిప్పీ’ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా జేడీ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని విలేకరి అడిగిన ప్రశ్నకు జేడీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘2008లో నాకు యాక్సిడెంట్‌ అయ్యింది. నడవలేని పరిస్థితి. ఓసారి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. నేను కూర్చున్న సీటు సౌకర్యంగా లేదు. దాంతో వీల్‌ఛైర్‌ కావాలని అడిగాను. అయితే ఆ సమయంలో నా పక్కనే జగన్‌ ఉన్నారు. కనీసం ఆయన నన్ను చూసి కూడా పలకరించలేదు. ఆయన ప్రవర్తన చూసి షాకయ్యా. గతేడాది మళ్లీ విమానాశ్రయంలో జగన్‌ను చూశా. అప్పుడు ఆయన ‘ఎలా ఉన్నారు?’ అంటూ నన్ను పలకరించారు. ఇన్నేళ్లలో జగన్‌లో ఎంతో మార్పు వచ్చింది’ అని వెల్లడించారు జేడీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu