HomeTelugu Newsవిశాఖలో జనసేన లాంగ్‌మార్చ్‌ ప్రారంభం

విశాఖలో జనసేన లాంగ్‌మార్చ్‌ ప్రారంభం

5 2జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విశాఖలో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపట్టిన లాంగ్‌మార్చ్‌ ప్రారంభమైంది. రాష్టంలో ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మద్దిలపాలెంలోని తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పవన్‌ లాంగ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ లాంగ్‌మార్చ్‌ రామాటాకీస్‌, ఆశీల్‌మెట్ట జంక్షన్‌ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి టీడీపీకి మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ తరఫున సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఈ లాంగ్‌మార్చ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు, అభిమానులు, భవన నిర్మాణ కార్మికులు ఈ నిరసన ర్యాలీకి తరలివచ్చారు.
లాంగ్‌మార్చ్‌ లైవ్‌ వీక్షించండి

Recent Articles English

Gallery

Recent Articles Telugu