ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె.విశ్వనాథ్.. హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని.. పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఫిలింనగర్లోని తన నివాసంలో కె.విశ్వనాథ్ మొక్కను నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం క్షీణిస్తోందని దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సంతోష్ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నంలా కొనసాగిస్తున్నారన్నారు.