టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల్లో ఒకరు కాజల్. వ్యక్తిగత కారణాల వలన కొంత గ్యాప్ తీసుకున్న కాజల్ రీఎంట్రీకి రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ ఆమెను సంప్రదించడం .. ఆమె అంగీకరించడం జరిగిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
‘పుష్ప’ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందించాడు. ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ముఖ్యంగా సమంత చేసిన ఐటమ్ సాంగ్కి మంచి రెస్ఫాన్స్ వచ్చింది. ఈ సారి అంతకుమించి ‘పుష్ప 2’ ఐటమ్ సాంగ్ ను దేవిశ్రీ ట్యూన్ చేశాడట. ఆ పాట కోసమే ఇప్పుడు కాజల్ ని తీసుకున్నట్టుగా చెబుతున్నారు.
గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కాజల్ ‘నేను పక్కా లోకల్’ ఐటమ్సాంగ్ చేసిన సంగతి తెలసిందే. ఆ పాటకి ఆమె కోటి రూపాయలు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.