HomeTelugu Trendingనిర్మాతగా మారిన కరీనా కపూర్‌

నిర్మాతగా మారిన కరీనా కపూర్‌

Untitled 1

21 ఏళ్లుగా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా కరీనా కపూర్ నిర్మాతగా మారుతోంది. తాజాగా ఆమె తన తొలి చిత్రాన్ని ప్రకటించింది. మరో నిర్మాత ఏక్తా కపూర్ తో కలసి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్టు కరీనా పేర్కొంది. ‘సిటీ లైట్స్’, ‘అలీఘర్’, ‘ఒమెర్తా’, ‘షాహిద్’.. వంటి ప్రశంసలందుకున్న చిత్రాలను రూపొందించిన హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహిస్తాడు.

కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో దీనిని యూకే నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తనకు హన్సల్ సినిమాలంటే చాలా ఇష్టమనీ, ఆయన దర్శకత్వంలో తన తొలి చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందనీ కరీనా ఈ సందర్భంగా తెలిపింది. కాగా ఈ చిత్రంలో కరీనా కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం కరీనా ఆమిర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’ చిత్రంలో నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu