HomeTelugu Trendingసరోగసీపై నటి కస్తూరి ట్వీట్‌.. వైరల్‌

సరోగసీపై నటి కస్తూరి ట్వీట్‌.. వైరల్‌

kasturi shankar tweet on su
సీనియర్‌ న‌టి క‌స్తూరి స‌రోగ‌సీ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. స్టార్‌ హీరోయిన్‌ న‌య‌నతార‌, డైరెక్టర్‌ విఘ్నేష్ శివ‌న్ దంప‌తులు స‌రోగ‌సీ ద్వారానే క‌వ‌ల పిల్ల‌లకు త‌ల్లిదండ్రులైన సంగ‌తి తెలిసిందే. ఆదివారం న‌య‌న్ దంప‌తులు స‌రోగ‌సీ ద్వారా క‌వ‌ల‌ల‌ను పొందిన‌ట్టు వెల్ల‌డైన కాసేప‌టికే క‌స్తూరి స‌రోగ‌సీపై ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

“భార‌తదేశంలో స‌రోగ‌సీపై నిషేధం ఉంది. 2022 జనవరి నుంచి ఈ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింది. క్లిష్ట ప‌రిస్థితుల్లో త‌ప్ప స‌రోగ‌సీని అనుమతించరు. రానున్న రోజుల్లో దీని గురించి ఎక్కువ‌గా విన‌బోతున్నాం” అని ఆమె త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను చూసినంత‌నే న‌య‌న్ అభిమానులు క‌స్తూరిపై మండిపడ్డారు. మీ ప‌ని మీరు చూసుకుంటే మంచిదంటూ ఆమెపై ట్రోలింగ్ మొద‌లెట్టారు.

ఈ ట్రోలింగ్‌పైనా క‌స్తూరి వెనువెంట‌నే స్పందించారు. “అర్హ‌త క‌లిగిన న్యాయ‌వాదిగా ఈ చ‌ట్టంపై విశ్లేష‌ణ చేసే హ‌క్కు నాకుంది. నేను ఎవ‌రినీ ఉద్దేశించి ఈ ట్వీట్ పోస్ట్ చేయ‌లేదు” అని క‌స్తూరి ట్రోలర్ల‌కు నేరుగానే రిప్లై ఇచ్చారు. అయిన ఆమెపై ట్రోల్స్‌ ఆగడం లేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu