ప్రముఖ యాంకర్, నటి అనసూయ నటించిన ‘కథనం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘ఆసుపత్రిలో మాయమైపోయిన మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా?’ అని ఓ పోలీసు అధికారి ప్రశ్నిస్తున్న డైలాగ్తో ట్రైలర్ ఆరంభమైంది. ‘మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ముందు నేను ఎవర్నో, ఏం చేస్తుంటానో తెలియాలి’ అంటూ అనసూయ వివరణ ఇచ్చారు. ‘డైరెక్టర్ కావాలనే నా కల నిజమైంది. కానీ అంతకంటే పెద్ద సర్ప్రైజ్ నా కోసం ఎదురుచూస్తోందని నాకు తెలియదు’ అంటూ ఆమె వివరిస్తూ వచ్చారు. క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అనసూయ ఫైటింగ్తో అదరగొట్టారు.
‘కథనం’ కు ఎన్. రాజేశ్ దర్శకత్వం వహించారు. అవసరాల శ్రీనివాస్, ధనరాజ్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు 9న ఈ చిత్రం విడుదల కాబోతోంది.