ప్రజాకూటమి ప్రచారతార కాంగ్రెస్ నేత, హీరోయిన్ విజయశాంతి సీఎం కేసీఆర్.. ఫామ్ హౌస్ నుంచి పాలిస్తున్నారని విమర్శించారు. మహిళలు పిరికివాళ్లు కారు.. కాంగ్రెస్ ప్రచారకమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్కతో కలసి ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్కు వచ్చిన ఆమె.. అక్కడ నిర్వహించిన మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు పిరికివాళ్లు కారు.. నా సినిమాలను ఆదర్శంగా తీసుకోండి అని విజయశాంతి అన్నారు. ప్రజల సమస్యలు విని పరిష్కరించే నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళకూ చోటు కల్పించలేదని, కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల్లో పదిమంది మహిళలున్నారని తెలిపారు. రేపు జరగబోయే మార్పుకి కరీంనగర్ వేదిక కావాలని భట్టి విక్రమార్క అన్నారు. దొర సంస్కృతిని టీఆర్ఎస్ తీసుకొచ్చిందని.. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. ప్రజాకూటమిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.