HomeTelugu Trending'సర్కారు వారి పాట'.. డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్‌

‘సర్కారు వారి పాట’.. డబ్బింగ్‌ పూర్తి చేసుకున్న కీర్తి సురేష్‌

Keerthy suresh completes du

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. పరుశురామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా మే12న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ కూడా డబ్బింగ్‌ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసిన కీర్తి సర్కారు వారి పాట సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu