HomeTelugu Newsస్వీటీతో 'సైలెన్స్'గా హాలీవుడ్‌ స్టార్‌

స్వీటీతో ‘సైలెన్స్’గా హాలీవుడ్‌ స్టార్‌

4 15ప్రముఖ నటి అనుష్క‌, మాధ‌వ‌న్ కాంబినేష‌న్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ‘సైలెన్స్’. దాదాపు 100కి పైగా సినిమాల్లో న‌టించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడ‌స‌న్ తొలిసారి ఈ ఇండియ‌న్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పోరేష‌న్ సంస్థతో క‌లిసి.. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. కిల్ బిల్, హేట్ ఫుల్ ఎయిట్ మ‌రియు రిస‌ర్వోయ‌ర్ డాగ్స్ చిత్రాల్లో న‌టించిన హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ‌స‌న్, అనుష్క‌, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధ‌వ‌న్, సుబ్బరాజు, అంజ‌లి, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సీఈవో విశ్వప్రసాద్ మాట్లాడుతూ…. ‘ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంద‌ర్నీ త‌ప్పకుండా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. అలాగే ఓ వినూత్నమైన సినిమా చూసామ‌నే ఫీలింగ్ క‌లిగిస్తుంది. ఈ చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. యు.ఎస్.ఎ లోని సీయోట‌ల్ లో ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు షూటింగ్ చేయ‌నున్నాం. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ తో టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టుల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. ఈ మూవీ టీజ‌ర్ ను మేలో గ్రాండ్ గా యు.ఎస్.ఎ లో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు. సీయోటెల్ హెడ్ క్వార్టర్స్ గా స్ధాపించిన ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‌. ఈ సంస్థ టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ మ‌రియు హాలీవుడ్ ఇండ‌స్ట్రీల‌లో పలు సినిమాలు నిర్మిస్తోందని నిర్మాత వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu