అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘మానాడు’ ఫేం విక్రమ్ ప్రభు డైరెక్షన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రంలో కోలీవుడ్ సీనియర్ హీరో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘రోజా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్గా నటించనున్నట్లు సమాచారం. తెలుగులో ఈయన రామ్చరణ్ ‘ధృవ’ సినిమాలో విలన్గా నటించిన విషయం తెలిసిందే. మళ్ళీ ఆరేళ్ళకు ఈ చిత్రంలో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన రానుంది. నాగచైతన్య పోలీస్ అధికారిగా కనిపించనున్న ఈసినిమా ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు.