HomeTelugu Trendingఅడవిశేష్‌ 'ఎవరు' పై మహేష్‌ బాబు ప్రశంసలు

అడవిశేష్‌ ‘ఎవరు’ పై మహేష్‌ బాబు ప్రశంసలు

4 23సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు.. ‘ఎవరు’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రంలో అడవిశేష్‌, రెజీనా ప్రధాన పాత్రల్లో నటించారు. నవీన్‌ చంద్ర, మురళీ శర్మ, పవిత్ర లోకేష్‌ కీలక పాత్రల్లో కనిపించారు. నూతన దర్శకుడు వెంకట్‌ రాంజీ తెరకెక్కించారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. శ్రీ చరణ్‌ పాకాల సంగీతం అందించారు. ఆగస్టు 15 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయం అందుకుంది. విమర్శకులతోపాటు సినీ ప్రముఖులు సైతం ఈ చిత్రం బాగుందని ట్వీట్లు చేశారు.

తాజాగా ‘ఎవరు’ సినిమా చూసిన మహేష్‌ ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నారు. సినిమా థ్రిల్‌కు గురి చేసిందని అన్నారు. ‘ఎవరు’ సినిమా చూశా. అద్భుతమైన కాన్సెప్టుతో సీటు అంచున ప్రేక్షకుడ్ని ఉంచే థ్రిల్లర్‌ ఇది. బాగా డైరెక్ట్‌ చేశారు. సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో అడివి శేష్‌, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేష్‌ పోస్ట్‌ చేశారు. దీనికి అడివి శేష్‌ స్పందించారు. ‘ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్క్రీన్‌లో మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సూపర్‌స్టార్‌. ‘మేజర్‌’ సినిమాతో కూడా మీరు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా’ అని అన్నారు. మహేష్‌ నిర్మిస్తున్న ‘మేజర్‌’ సినిమాలో అడివి శేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!