HomeTelugu Trendingసర్కారు వారి పాట కోసం భారీ సెట్

సర్కారు వారి పాట కోసం భారీ సెట్

Mahesh babu movie shooting
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా అరవిందస్వామి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్లో మహేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే మహేష్‌బాబు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!