మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించిన టీజర్ను శుక్రవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉండబోతుందో ఈ టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. మేజర్ పాత్రలో మహేష్ బాగా చేశాడనిపిస్తోంది. ”మీరెవరో మాకు తెలియదు.. మీకు మాకు ఏ రక్త సంబంధమూ లేదు.. కానీ మీకోసం.. మీ పిల్లల కోసం పగలు, రాత్రి, ఎండా, వానా అని లేకుండా పోరాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత” అనే డైలాగ్తో మొదలవుతుంది టీజర్. ప్రొఫెసర్ భారతి పాత్రలో విజయశాంతి చెప్పిన ‘గాయం విలువ తెలిసినాడే సాయం చేస్తాడు’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సంక్రాంతికి విడుదల చేస్తున్నందున సంక్రాంతి పేరుతో ఓ డైలాగ్ విసిరారు. విలన్ ప్రకాష్ రాజ్ హీరో మహేష్ బాబునుద్దేశించి ‘ప్రతి సంక్రాంతికి అల్లుళ్లు వస్తారు. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు.’ అనే డైలాగ్కి అభిమానులు ఈలలు వేస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11 వ తేదీన విడుదల కాబోతుంది. రష్మిక మందన్న హీరోయిన్ కాగా, విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నది.