HomeTelugu Trendingసినిమా రిలీజ్ కాకుండానే సీక్వెల్ చెప్పేసిన వర్మ

సినిమా రిలీజ్ కాకుండానే సీక్వెల్ చెప్పేసిన వర్మ

9 13
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఆయన ప్రతి సినిమా ఓ వివాదం. వివాదాస్పద కథలను ఎంచుకుని.. ఫ్రీ పబ్లిసిటీ కొట్టేస్తారు.. ఇప్పటికే ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ తెరకెక్కించే పనిలో ఉన్నారు ఆర్జీవీ. తన శిష్యుడు.. సిద్ధార్ధ తాతోలు డైరెక్షన్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్‌తో పాటు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటు రిలీజ్ డేట్ ప్రకటించారో లేదో.. వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నట్టు ప్రకటించారు రాంగోపాల్ వర్మ.

పార్ట్-1కి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు టైటిల్ పెట్టిన వర్మ.. సీక్వెల్‌కు ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు. దానికి ఓ రీజన్‌ కూడా చెప్పుకొచ్చాడు వర్మ.. తాజాగా వల్లభనేని వంశీ ఇంటర్వ్యూల్లో చేస్తున్న ఫైరింగ్ వ్యాఖ్యలను చూస్తే తనకో ఆలోచన వచ్చిందని.. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’కు సీక్వెల్ తీయాలనుకుంటున్నట్లు.. దానికి ‘రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.

EJfwOH5VAAMmZm8

Recent Articles English

Gallery

Recent Articles Telugu