సూపర్స్టార్ మహేశ్బాబు మరో మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సంవత్సరం క్రితం ఏఎంబీ సినిమాస్ పేరుతో హైదరాబాద్లో ఓ భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన మరో భారీ థియేటర్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాల సమాచారం. అయితే, ఈసారి బెంగళూరులో.. ఏషియన్ సినిమాస్తో కలిసి భారీ మల్టీప్లెక్స్ నిర్మించనున్నారని తెలుస్తోంది. ఒకవేళ మల్టీప్లెక్స్ నిర్మిస్తే దానికి కూడా ఏఎంబీ సినిమాస్ అనే పేరు పెడతారా.. లేక మరే పేరైనా ఆలోచిస్తారా అని చర్చ నడుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ఇచ్చిన బ్లాక్బస్టర్ హిట్తో మంచి జోష్ మీదున్న ఆయన ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాల్లో విహరిస్తున్నారు. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న సూపర్స్టార్.. తన తర్వాతి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.