టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమాను చేయనున్నట్టు తాజాగా అధికారిక ప్రకటన చేశాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ రావడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
అయితే ఈ సినిమాలో హీరోయిన్గా మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ ను ఎంపిక చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది. ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా చేయడానికి అంగీకరించిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించవల్సి వుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో ‘పరమగురు’ సినిమా చేస్తోంది. పవన్ తో చేసే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.