HomeTelugu Trendingమణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ప్రారంభం.!

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ప్రారంభం.!

5 11
స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు ‘పొన్నియన్‌ సెల్వన్‌’ సెట్స్‌ మీదకి వెళ్లనుంది. చియాన్‌ విక్రమ్‌, కార్తీ, జయంరవి, పార్తిబన్‌, జయరాం, ఐశ్వర్యరాయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించనున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌లో థాయ్‌లాండ్‌ దేశంలో నేటి నుండి మొదలు కానుంది. దాదాపు 40 రోజులపాటు అక్కడే షూటింగ్‌ జరుగుతుంది. ఇందుకోసం వారం రోజులు ముందుగానే చిత్ర యూనిట్‌ మొత్తం థాయ్‌ లాండ్‌ వెళ్లి షూట్ కి సిద్దమయ్యింది. ఈ షెడ్యూల్ లో కార్తీ, జయంరవి పాల్గొననుండగా మరి కొద్ది రోజుల్లో చియాన్‌ విక్రమ్‌ పాల్గొననున్నాడు. కల్కి రాసిన చారిత్రాత్మక నవల అయిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కథని వెండితెరపై ఆవిష్కరించడం తన కలగా పలు సందర్భాల్లో దర్శకుడు పేర్కొన్నారు. అయితే ఈ సినిమా నుండి కీర్తి సురేష్ తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. రజనీ కాంత్ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుండడంతో డేట్స్ కుదరక ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu