HomeTelugu Big Storiesకొణిదల వారసురాలు నిహారిక షాకింగ్ నిర్ణయం

కొణిదల వారసురాలు నిహారిక షాకింగ్ నిర్ణయం

12 6కొణిదల వారసురాలు.. మెగా డాటర్ నిహారిక నటనకు గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్‌తో పాపులర్ అయిన నిహారిక ‘ఢీ’ రియాలిటీ షోతో బుల్లితెరపైన మెరిసింగి. అక్కడ నుండి మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకుని బుల్లితెర నుండి వెండితెరకు ప్రమోట్ అయిన నిహారిక.. ‘ఒక మనసు’ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తరువాత ‘హ్యాపీ వెడ్డింగ్’, ‘సూర్యకాంతం’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ సరైన హిట్ కొట్టలేకపోయింది నిహారిక.

నిహారిక సినిమాల్లోకి వస్తున్నప్పుడే చాలా మంది మెగాఫ్యాన్స్ నుండి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.. దీనికి తోడు ఆమె నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా హిట్ కాకుండా బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలం కావడంతో నిహారిక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇక నటనకు స్వస్తి చెప్పి.. నిర్మాతగా మారనుందట నిహారిక.

12a 1

నిహారిక సినిమాల్లోకి రాకముందు ఆమెకు పేరు తీసుకువచ్చిన వెబ్ సిరీస్‌తో తిరిగి పుంజుకునేందుకు నిర్మాత అవతారం ఎత్తబోతుందట నిహారిక. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బేన‌ర్‌పై వెబ్ సిరీస్‌లు చేసిన నిహారిక ఇదే బ్యానర్‌లో సొంతంగా సినిమాలు చేయబోతుందట. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్‌తో క్రేజ్ సంపాదించిన నిహారిక.. దర్శకుడు ప్రణీత్‌తో మరోసారి వెబ్ సిరీస్ నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తుందట. అయితే ఇందులో నిహారికతో పాటు నాగబాబు కూడా నటించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నిహారిక రియల్ లైఫ్ ఫాదర్, రీల్ లైఫ్‌లో కూడా ఫాదర్ గానే నటిస్తున్నారని.. తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే డ్రామాగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుందని తెలుస్తోంది. అయితే సినిమాలకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి వచ్చిన నిహారిక ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తుందా? లేక నిర్మాతగానే కొనసాగుతుందా అన్నది ఆసక్తిగా మారింది. వీటిన్నింటికీ త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu