HomeTelugu Newsరక్తదానం చేసిన మంత్రి కేటీఆర్

రక్తదానం చేసిన మంత్రి కేటీఆర్

12 19
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రక్త దానం చేశారు. లాక్ డౌన్ వేళ వ్యాధి గ్రస్థులకు రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇప్పటికే చిరంజీవి, నాని లాంటి హీరోలు ముందుకు వచ్చి రక్త దానం చేశారు. ఇప్పుడు ఆ జాబితాలో కేటీఆర్ కూడా చేరిపోయారు. కేటీఆర్ తెలంగాణ భవన్ లో రక్త దానం చేశారు. అంతే కాకుండా పార్టీ కార్యకర్తలు వారి ఊర్లలో ఉన్న ఆస్పత్రుల్లో రక్త దానం చేయాలని పిలుపునిచారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా కార్యకర్తలు ఇంటిపై జండా ఎగురవేయాలని టీఆర్‌ఎస్‌ ఇప్పటికే పిలుపునిచ్చింది. ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ప్రజలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ఆఫీసుల్లో నిరాడంబరంగా పార్టీ జెండాలు ఎగర వేయాలని సూచించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu