HomeTelugu Newsతెలంగాణ రెండో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళిసై

తెలంగాణ రెండో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన తమిళిసై

3 7తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెతో తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణ చౌహాన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతోపాటు, హిమాచల్ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఇక అంతకు ముందు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్న తమిళిసై సౌందరరాజన్‌, ఆమె కుటుంబసభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర మంత్రులు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌ చేరుకున్న ఆమె.. తెలంగాణ రాష్ట్ర రెండో గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu