HomeTelugu Trending'మొగలిరేకులు' నటుడు కన్నుమూత

‘మొగలిరేకులు’ నటుడు కన్నుమూత

 

Mogalirekulu serial actor

బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన తన ఇన్ స్టా ద్వారా తెలిపారు. అతడిని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘పవి.. ఈ బాధను మేం వర్ణించలేకపోతున్నాం. మా జీవితంలో చాలా ముఖ్యమైనవాడివి. ఈ వార్త విన్న తర్వాత మేము ఇది నిజం కాకూడదని కోరుకున్నాం. ఇది అబద్ధం అయితే బాగుండని ఆశపడ్డాను.. కానీ నువ్వు నిజంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లావనే నిజాన్ని జీర్ణయించుకులేకపోతున్నాం. కనీసం నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై కూడా చెప్పలేకపోయాం. ఇకపై నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నీ కుటుంబానికి దేవుడు మరింత శక్తిని ఇవ్వాలి’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దయ చనిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

మేఘన పోస్టుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దయ ఎలా చనిపోయాడు ? ఎప్పుడు జరిగింది ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చక్రవాకం. మంజుల నాయుడు తెరకెక్కించే ఈ సీరియల్‌కు అప్ఇంద్రనీల్ భార్య మేఘన ఇన్ స్టా పోస్టుపై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అసలు ఏం జరిగింది ?.. పట్లో మంచి క్రేజ్‌ ఉండేది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu