HomeTelugu Trendingసంపూ 'కొబ్బరి మట్ట' అతిథిగా మోహన్‌బాబు

సంపూ ‘కొబ్బరి మట్ట’ అతిథిగా మోహన్‌బాబు

6 6

బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు సినిమా వేడుక కోసం డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు విచ్చేయనున్నారు. సంపూ త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘కొబ్బరి మట్ట’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ దీనికి వేదిక. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోహన్‌బాబు హాజరు కాబోతున్నారని సంపూ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పారు. ‘నాలాంటి ఒక చిన్న నటుడు అడిగిన వెంటనే మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి విచ్చేస్తున్న మా రియల్‌ పెదరాయుడు మోహన్‌బాబుకి నా వందనాలు’ అని సంపూ ట్వీట్‌ చేశారు.

‘కొబ్బరి మట్ట’లో సంపూ పెదరాయుడు అనే పాత్రలోనూ సందడి చేయబోతున్నారు. ఈ సినిమాకు రూప‌క్ రొనాల్డ్ స‌న్ దర్శకత్వం వహించారు. ‘హృదయ కాలేయం’ ఫేం స్టీవెన్ శంక‌ర్ కథ, కథనం అందించారు. సాయి రాజేష్ నిర్మాత‌. ఈ చిత్రం డైలాగ్‌ ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. అనేక సార్లు వాయిదాపడ్డ ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 10న విడుదల కాబోతోంది. ఈ చిత్రం నైజాం, విదేశీ హ‌క్కుల్ని నోబారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ సొంతం చేసుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!