అనీషా క్రియేషన్స్ బ్యానర్లో బాలాజీ సమర్పణలో సుగుణ సుబ్రమణ్యం నిర్మిస్తోన్న చిత్రం ‘మిస్టరీ ఆఫ్ సారిక’. సాయిబాబు, ఆశిరాయ్, సురయ పరివిన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో రఘుబాబు విలన్గా, జబర్దస్త్ రాజమౌళి కమెడియన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ను మూవీయూనిట్ రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ పల్లె మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టీజర్ను ఆగస్ట్ 20న విడుదల చేశాము. సస్పెన్స్తో కూడిన మిస్టరీ ఆఫ్ సారిక సినిమా అందరికీ నచ్చే విధంగా ఉండబోతోంది. త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాము. మా నిర్మాత సుగుణ సుబ్రమణ్యంగారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మిస్తున్నారు..’’ అని తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ రామ్ పల్లెగారు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు జరువుకుంటున్న మా సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్ను విడుదల చేశాము. త్వరలోనే ట్రైలర్, సాంగ్స్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’’ అని అన్నారు.