HomeTelugu Trendingహిందు దేవాలయాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు...

హిందు దేవాలయాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు…

1 5
మెగా బ్రదర్, నటుడు నాగబాబు తరచూ సోషల్‌ మీడియాలో ఎదో ఒక సంచలనం వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. తాజాగా ఆయన హిందూ దేవాలయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని బీజేపీ ఎంపీ సత్యపాల్‌ సింగ్‌ అన్నారని ఆయన వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. హిందూ దేవాలయాల నిర్వహణ ప్రభుత్వంతో సంబంధంలేని వారి చేతుల్లోనే ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ‘జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే స్థానంలో చూడాలని ఉంది’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన సత్యపాల్ సింగ్ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu