HomeTelugu Trendingట్విట్టర్‌ వేదికగా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు..

ట్విట్టర్‌ వేదికగా నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు..

9 26
సినీ పెద్దలు తెలంగాణ మంత్రిని కలవడంలో భాగంగా తనను పిలవలేదని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగాబ్రదర్ నాగబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని, సినీ పెద్దలకు, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలంటూ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా టీడీపీని టార్గెట్‌ చేస్తూ ట్విట్టర్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందో లేక జనసేన వస్తుందో.. లేక బీజేపీ వస్తుందో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు. కానీ టీడీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరోసారి అధికారంలోకి రాదని గట్టి నమ్మకంగా ఉందని అన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రజలకు ఊడబొడిచిందేమీ లేదు.. అభివృద్ధి అంతా అనుకూల టీవీల్లోను.. పత్రికల్లోను మాత్రమే కనబడేది. గ్రౌండ్‌లో కనిపించేది తక్కువ అన్నారు. టీడీపీ గురించి ఇంకా అవినీతి, ఇసుక మాఫియా, కాల్‌మనీ అబ్బో.. ఇంకా చాలా ఉన్నాయి. ఈ ట్విట్టర్ ఏమాత్రం సరిపోదు.. లక్ష పేజీల గ్రంధాలే రాయొచ్చు అన్నారు. అందుకే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ నేతలు ఊహల్లోంచి బయటకు రావాలి. తరువాత మేమే వస్తాం, మాదే రాజ్యం అనే ఊహలు మానుకోవాలి అన్నారు. ఇంకా పగటి కలల్లోనే జీవిస్తామంటే మీ ఇష్టం అంటూ ట్విట్టర్‌లో టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu